
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్సిటీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీకి చెందిన అనుసంధాన్ నేషనల్రీసెర్చ్ఫౌండేషన్ గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్డాక్టర్ మోతాహర్ రెజాకు పరిశోధనా ప్రాజెక్టును రీలీజ్చేస్తూ మంగళవారం ఆర్డర్లు అందించింది.
ప్రవాహ అస్థిరతలను అధ్యయనం చేయడానికి, మైక్రోడొమైన్, మైక్రోఫ్లూయిడిక్స్పై లోతైన పరిశోధనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అందజేసినట్లుగా రెజా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సైన్స్అండ్ టెక్నాలజీ రంగంలో ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే అవకాశం దక్కిందని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ఫెలో అవసరమని ఎంటెక్, ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేసి మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రామింగ్లో ప్రావీణ్యం ఉన్న వారు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించిన డాక్టర్ రెజాను గీతం వీసీ ప్రొఫెసర్ డీఎస్రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, వివిధ విభాగాల డైరెక్టర్లు, హెచ్ఓడీలు అభినందించారు.